
కామారెడ్డి, 8 నవంబర్ (హి.స.)
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న
బాన్సువాడకు చెందిన ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాన్సువాడ కు చెందిన కానిస్టేబుల్ బుక్యా శ్రీను కోర్టు కేసు కు సంబంధించి వ్యక్తుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎస్పీ తెలిపారు. అనైతిక చర్యలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు