బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
అనంతపురం, 8 నవంబర్ (హి.స.)జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థులకు మ
లోకేశ్


అనంతపురం, 8 నవంబర్ (హి.స.)జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థులకు మద్దతుగా ఆయన రెండు రోజుల పాటు బీహార్‌లో పర్యటించనున్నారు.

వివరాల ప్రకారం, ఈ రోజు శనివారం (నవంబర్ 8) కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని లోకేశ్ నేరుగా పాట్నాకు బయలుదేరనున్నారు. అదే రోజు సాయంత్రం ఆయన రెండు కీలకమైన సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం ఆదివారం ఉదయం పాట్నాలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నవంబర్ 6న తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, రెండో విడత పోలింగ్ నవంబర్ 11న 122 స్థానాలకు జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande