
మహబూబ్నగర్, 9 నవంబర్ (హి.స.)
వర్షాకాలం నుండి కురుస్తున్న వర్షాలకు
వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మిడ్జెల్ మండల కేంద్రంలో ఇదమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న బోరు బావి నుండి నీరు ఉబికి వస్తుంది. భూగర్భజలాలు అడుగంటి పోయిన బోరు తాజా వర్షాలకు భూగర్భ జలాలు పెరిగి ఆ బోరు నుంచి నీరు పైకి పొంగుతుండడంతో గ్రామస్తులు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మోటారు లేకుండానే ధారాళంగా నీరు ఉబికి వస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు