
ఢిల్లీ, 22 డిసెంబర్ (హి.స.)ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి. గుల్మార్గ్లోని స్కై రిసార్ట్, సోనామార్గ్, దూద్పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడి వాళ్లు గజగజ వణుకుతున్నారు.
ఇటు కశ్మీర్ అంతటా పరుచుకున్న మంచు దుప్పటి ఓ వైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు చలికి తోడు అక్కడక్కడా వర్షం కూడా కురుస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV