గగనతలంలో ఎమర్జెన్సీ
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.) ఎయిరిండియా విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది (Air India flight). సాంకేతికలోపం కారణంగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోయింది. దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. జాతీ
AIR INDIA


ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)

ఎయిరిండియా విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది (Air India flight). సాంకేతికలోపం కారణంగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోయింది. దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 3.20 గంటల సమయంలో ఎయిరిండియా బోయింగ్ విమానం (Flight AI887) టేకాఫ్ అయింది. ఆ వెంటనే కుడివైపు ఇంజిన్‌ (Engine No 2) ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని పైలట్ గుర్తించారు. తర్వాత అది జీరోకు పడిపోయింది. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు (Air India). టేకాఫ్ అయినచోటే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. భద్రతా ప్రోటోకాల్స్ ఆధారంగా విమాన సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆ విమానంలో సాంకేతికపరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande