.మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో పెను.ప్రమాదం తప్పింది
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.) : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్
.మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో పెను.ప్రమాదం తప్పింది


అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)

: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు వ్యాపించిన సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి మంటల వాహనం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయకుండానే డ్రైవర్ కిందకు దిగిపోవడంతో, మండుతున్న ఆ ఓమ్నీ వ్యాన్ అదుపు తప్పి నేరుగా రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.

నిప్పురవ్వలతో ఉన్న వాహనం పెట్రోల్ బంకు లాంటి అత్యంత ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లడంతో అక్కడ ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. సిబ్బంది సమయస్ఫూర్తి – సాహసం ఒకవేళ మంటలు పెట్రోల్ ట్యాంకర్లకు గనుక వ్యాపించి ఉంటే ఊహించని స్థాయిలో విస్ఫోటనం సంభవించి ఉండేది. కానీ, పెట్రోల్ బంకు సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి వెంటనే అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసి, వ్యాన్‌పై రసాయనాలను చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande