
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో కీలక బదిలీలు ) చోటుచేసుకున్నాయి. ఏపీ సర్కార్ ( మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలు, కొత్త పోస్టింగ్స్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పలు పట్టణాల్లో పరిపాలనా మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ బదిలీలతో మున్సిపల్ పరిపాలనలో సమర్థత పెంచడం, పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వివిధ పట్టణాల్లో కొత్త అధికారుల నియామకంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ