ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం: ప్రధాని మోదీ
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. మానవుల మనుగడను కాపాడేందుకు.. సత్యం, న్యాయం, ధర్మం వైపు నిలబడేందుకు గురుగోబింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిస్తాయని ప్రధాని తెలిపారు
ప్రధాని మోదీ


హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. మానవుల మనుగడను కాపాడేందుకు.. సత్యం, న్యాయం, ధర్మం వైపు నిలబడేందుకు గురుగోబింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిస్తాయని ప్రధాని తెలిపారు. పదవ సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ విజన్ ఇప్పటికీ అనేక మందిని సేవ, నిస్వార్ధ కర్తవ్యం దిశగా నడుపుతుందన్నారు.

గురు గోబింద్ సింగ్ జీ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. గురుగోబింద్కు వినమ్రంగా నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది పాట్నాలోని తకత్ శ్రీ హరిమందిర్ పాట్నా సాహిబ్ వెళ్లిన ఫోటోలను ఆయన పోస్టు చేశారు. గురుగోబింద్కు చెందిన పవిత్ర పాదరక్షకులు జోరే సాహిబ్ను దర్శించుకున్నట్లు కూడా మోదీ చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande