సైబర్‌ దాడి నిందితుడి అరెస్టు.. హైదరాబాద్‌ పోలీసులకు అమెరికన్‌ సీఈఓ కృతజ్ఞతలు
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) హైదరాబాద్‌ పోలీసులకు అమెరికన్‌ సీఈఓ బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కృతజ్ఞతలు క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై జరిగిన హ్యాకింగ్‌ ఘటనలో నిందితుడు భారత్‌లో అరెస్టు కావడంతో ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఏడాది ప్ర
సైబర్‌ దాడి నిందితుడి అరెస్టు.. హైదరాబాద్‌ పోలీసులకు అమెరికన్‌ సీఈఓ కృతజ్ఞతలు


ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్‌ పోలీసులకు అమెరికన్‌ సీఈఓ బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కృతజ్ఞతలు

క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై జరిగిన హ్యాకింగ్‌ ఘటనలో నిందితుడు భారత్‌లో అరెస్టు కావడంతో ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

ఈ ఏడాది ప్రారంభంలో క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై సైబర్‌దాడి జరిగింది. కస్టమర్ల డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లు యూఎస్ వెలుపల ఉన్న సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు లంచం ఇచ్చారని ఆ సమయంలో కాయిన్‌బేస్‌ వెల్లడించింది. హ్యాకర్లు 20 మిలియన్ల డాలర్లు డిమాండ్ చేశారని పేర్కొంది. ఈ హ్యాకింగ్ వల్ల సంస్థకు 400 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘బాధ్యులకు కఠినశిక్ష పడేలా దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తాం. హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వబోం. ఈ ఘటన వల్ల కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మోసపోయిన వారికి పరిహారం చెల్లిస్తాం’’ అని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఓ మాజీ ఏజెంట్‌ను అరెస్టు చేశారు. ‘‘హైదాబాద్ పోలీసులకు ధన్యవాదాలు. హ్యాకర్లకు సహకరించిన మిగతావారికి ఇదే పరిస్థితి రానుంది’’ అని సీఈఓ (American CEO Brian Armstrong) ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande