
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) యూపీలోని పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో నిర్వహించిన ఒక అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో వడ్డించిన రైతాను సుమారు 200 మంది గ్రామస్తులు తిన్నారు. అయితే ఆ రైతా రేబిస్ సోకిన గేదె పాలతో తయారైనదని విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, పిప్రౌలి గ్రామానికి చెందిన ఓ రైతు పెంచుతున్న గేదె నుంచి సేకరించిన పాలతో పెరుగు తయారు చేసి రైతా సిద్ధం చేశారు. ఆ రైతాను అంత్యక్రియల సందర్భంగా గ్రామస్తులకు వడ్డించారు. అయితే కొద్ది రోజులకే ఆ గేదె రేబిస్ సోకి మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది. ఈ సమాచారం అధికారులకు చేరడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య శాఖ చర్యలు చేపట్టింది.
ఆ భోజన కార్యక్రమంలో రైతా తిన్న వారందరినీ గుర్తించిన వైద్య అధికారులు సుమారు 200 మందికి యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ను అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ