
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)
: రాష్ట్రంలో 3 మున్సిపాల్టీల గ్రేడ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్కు పెంచారు. గడచిన రెండేళ్లలో మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని హోదా పెంచారు. గ్రేడ్-1లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్ కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 2022 నుంచి మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు సంతృప్తికరంగా ఉండటంతో హోదా పెంచాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదా గ్రేడ్ 3 నుంచి గ్రేడ్-1కు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మున్సిపాలిటీకి 2021 నుంచి వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని హోదా పెంపు నిర్ణయం తీసుకున్నారు. హోదాల పెంపు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ