
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నం,: కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు( సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్ హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి. రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగే ఈవెంట్కు సినీ నటి హెబ్బాపటేల్ హాజరవుతున్నారు. వేడుకలకు హాజరయ్యేవారి కోసం పలు కేటగిరీల కింద టికెట్లు విక్రయిస్తున్నారు. ఇవి రూ.రెండు వేలు నుంచి రూ.50 వేలు వరకూ ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ