
సిద్దిపేట, 31 డిసెంబర్ (హి.స.) యాసంగి సీజన్ లో ఎక్కడ కూడా
యూరియా కొరత రాకుండా పగడ్బందిగా ప్రణాళిక ప్రకారం అన్ని సెంటర్ లలో యూరియా బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల, చెప్యాల ధర్మారం, మలుపల్లి గ్రామంలోని రైతు వేదికలో యూరియా కార్డుల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారని, రైతులు తమ పట్టా పాసు బుక్ తీసుకుని వచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కౌలు రైతులు సైతం వారు చేస్తున్న వ్యవసాయ భూమి యజమాని పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకువస్తే యూరియా అందిస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు