
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమయ్యింది. రైల్వే రంగంలో సరికొత్త విప్లవం ఉద్భవించింది. ఎంతో కాలంగా దేశంలోని ప్రయాణికులంతా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్ప్రెస్ రైలు వందశాతం మేరకు తన సత్తా చాటింది. రాజస్థాన్లోని కోటా - నాగ్డా సెక్షన్ మధ్య నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్ రన్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన ఘట్టానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ