
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.)
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ వారి అదుపులోనే ఉన్నాడు. మావోయిస్టుల అదుపులో ఉన్న కాంట్రాక్టర్ను విడిపించడానికి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాంట్రాక్టర్ కిడ్నాప్తో బీజాపూర్ జిల్లా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మావోయిస్టులు ఎందుకు వారిని కిడ్నాప్ చేశారన్నది తెలియరాలేదు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ కుటుంబసభ్యులు మావోయిస్టులు ఆయన్ని ఏం చేస్తారేమోనని భయపడుతున్నారు.
మావోయిస్టు పార్టీకి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య డివిజనల్ కమిటీ మెంబర్ మడివి గంగి అలియాస్ విమల అలియాస్ భీమేలు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ