హైదరాబాద్, 25 మే (హి.స.) ఇండియా తో పాటు ఇతర దేశాలలో తయారైన ఐఫోన్ల పై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక పెద్దగా ఫలించే అవకాశం లేదు. సుంకాలు విధించినా ఇండియాలో తయారు అయ్యే ఐఫోన్లు అమెరికాలో చౌకగానే లభిస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) స్పష్టం చేసింది. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ను నేరుగా ట్రంప్ హెచ్చరించినా కంపెనీ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టెక్ నిపుణులు కూడా భావిస్తున్నారు.చైనా వెలుప తయారీని పెంచాలన్న యాపిల్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియా తయారీ పెంచేందుకు యాపిల్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందని సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..