ముంబై, 25 మే (హి.స.)దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులు మినహా సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉంటున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం, నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 89,900గా ఉంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,560.. కిలో వెండి ధర రూ 99,900కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹9,808; ₹8,990; ₹7,410
ముంబై: ₹9,808; ₹8,990; ₹7,356
ఢిల్లీ: ₹9,823; ₹9,005; ₹7,368
కోల్కతా: ₹9,808; ₹8,990; ₹7,356
బెంగళూరు: ₹9,808; ₹8,990; ₹7,356
హైదరాబాద్: ₹9,808; ₹8,990, ₹7,356
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు