ఢిల్లీ, 25 మే (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) ఈ తెల్లవారుజామున భారీ వర్షం, ఈదురుగాలులు, ఉరుములతో అతలాకుతలమైంది. వేసవి తాపం నుంచి ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, నగరంలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం, విమాన సర్వీసులు ఆలస్యం కావడం వంటి తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షం కారణంగా వందకు పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది.
భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని అనేక రోడ్లు, అండర్పాస్లు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయం వైపు వెళ్లే అండర్పాస్లో నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఢిల్లీని విమానాశ్రయంతో కలిపే ప్రధాన అండర్పాస్ రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నీటితో నిండిపోయింది. ఫలితంగా, డజన్ల కొద్దీ వాహనాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. మింటో రోడ్డు ప్రాంతంలో కుండపోత వర్షానికి ఒక కారు పూర్తిగా నీట మునిగిపోయిన దృశ్యాలను ఏఎన్ఐ వార్తా సంస్థ పంచుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి