న్యూఢిల్లీ, 25 మే (హి.స.)
జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.
మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నేడు మనం $4,000 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాను ఉటంకిస్తూ.. నేడు భారతదేశం జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదని నీతి ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు.
అయితే, అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. మనం మన ప్రణాళిక, ఆలోచనకు కట్టుబడి ఉన్నాం.. రెండున్నర నుంచి మూడు ఏళ్లలోనే మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..