పాకిస్తాన్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వార్నింగ్..
హైదరాబాద్, 25 మే (హి.స.) భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టించిన పాక్ కు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బహ్రెయిన్లో జరిగిన అఖిల పక్ష ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.
అసదుద్దీన్


హైదరాబాద్, 25 మే (హి.స.)

భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త

పరిస్థితుల్ని సృష్టించిన పాక్ కు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బహ్రెయిన్లో జరిగిన అఖిల పక్ష ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన హత్యలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మతం గురించి అడిగిన తర్వాత హత్య చేయడం అంటే ఇస్లామిక్ బోధనలను వక్రీకరించడమేనన్నారు. పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పాక్ కవ్వింపులకు పూనుకుంటే మరింత దూకుడుగా బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఈసారి ప్రతిదాడులు మామూలుగా ఉండవని, భారత్ ఎదురు దాడికి దిగితే పాక్ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande