ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం
ఢిల్లీ 25 మే (హి.స.)ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం


ఢిల్లీ 25 మే (హి.స.)ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకావడం లేదని బీజేపీ పెద్దలకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ , జనగణనలపై రెండు తీర్మానాలను ఈ NDA సమావేశంలో ఆమోదించనున్నారు. ప్రధాని మోదీ మూడో టర్మ్‌లో ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సిందూర్, దేశ భద్రత , కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande