న్యూఢిల్లీ, 25 మే (హి.స.)
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేడు మనకి బాత్ (122వ ఎపిసోడ్)లో మాట్లాడారు. దేశంలో నక్సలిజం నిర్మూలనలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్-అబుజ్మఢ్ ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ భద్రతా దళాల అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. 2026 నాటికి నక్సల్-ముక్త భారతదేశం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే, నక్సల్-ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల ద్వారా సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..