అమరావతి, 26 మే (హి.స.): పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ )కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ()ను హిస్సార్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన హరియాణాలోని కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు నాలుగు రోజుల పాటు జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల ప్రారంభంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్కు చెందిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జ్యోతి కూడా ఒకరు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ