రాజస్థాన్, 26 మే (హి.స.)
రాజస్థాన్ కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా నీట్ కు సన్నద్ధమవుతున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నది. జమ్ముకశ్మీర్కు చెందిన జీషన్ అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం తానుంటున్న రూమ్లోనే ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. అయితే అంతకుముందు తన బంధువులతో ఫోన్లో మాట్లాడిందని, తాను చనిపోతున్నానని చెప్పిందని పోలీసులు వెల్లడించారు.
ఆమె అదే బిల్డింగ్లో పై అంతస్తులో ఉంటున్న మమత అనే మరో విద్యార్థినికి విషయం చెప్పారని తెలిపారు. ఆమె జీషన్ గదికి వెళ్లి చూడగా అప్పటికే తలుపులు లాక్ చేసుకుందని, మమత అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వాటిని బద్దలుకొట్టారని, అయితే అప్పటికే ఆమె సీలింగ్కు వేలాడుతూ కనిపించిందని వెల్లడించారు. దీంతో వారు జీషన్ను హుటాహుటిన దవాఖానకు తరలించారని, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారమన్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటాలో 15 మంది విద్యార్థులు చనిపోగా, ఈ నెలలో ఇది రెండో మరణం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..