అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. ఒకరి మృతి.. పంజాబ్‌లో టెన్షన్‌ టన్షన్..!
అమృత్‌సర్‌, 27 మే (హి.స.)పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. మే 27 మంగళవారం రోజున అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలిసింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు
1 killed in explosion on Majitha Road Bypass in Amritsar


అమృత్‌సర్‌, 27 మే (హి.స.)పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం రేపింది. మే 27 మంగళవారం రోజున అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలిసింది.

వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు పదార్థం తయారీపై ఫోరెన్సిక్‌ అధికారులు పరిశీలిస్తున్నారని పోలీసులు తెలిపారు.

గ్యాంగ్‌స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయం లేకపోవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గోల్డెన్ టెంపుల్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande