వడోదరా, 27 మే (హి.స.)- గుజరాత్ పర్యటనలో భాగంగా వడోదరా విమానాశ్రయం నుంచి నగర శివార్లలోని వైమానిక స్థావరం వరకు ప్రధాని మోదీ సోమవారం రోడ్షోలో పాల్గొన్నారు. కారు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. త్రివర్ణ పతాకాలు చేతపట్టి, మోదీపై పూలుచల్లి అంతా ఆయనకు ఘనస్వాగతం పలికారు. సిందూరం రంగును గుర్తుచేసేలా పలువురు మహిళలు ఎర్ర చీరలు ధరించి హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ ప్రాచుర్యంలోకి వచ్చిన కర్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం కూడా ఈ ర్యాలీలో పాల్గొంది. సోఫియా స్వస్థలం వడోదరా. వడోదరా నుంచి ప్రధాని దాహోద్కు వెళ్లారు. సాయంత్రం భుజ్ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నాక మరో రోడ్షోలో పాల్గొన్నారు. రాత్రి రాజ్భవన్లో బసచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు