పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్‌ రేట్లు ఇవే..
ముంబై, 27 మే (హి.స.) నెల రోజుల క్రితం బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. అయితే చూస్తుండ‌గానే బంగారం ధ‌ర‌లు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. లక్ష దాటిన తర్వాత స్వచ్ఛమైన బంగార
Gold


ముంబై, 27 మే (హి.స.)

నెల రోజుల క్రితం బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. అయితే చూస్తుండ‌గానే బంగారం ధ‌ర‌లు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. లక్ష దాటిన తర్వాత స్వచ్ఛమైన బంగారం ధర 95 వేల వరకు వచ్చింది.. ఆ తర్వాత ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. తాజాగా మళ్లీ బంగారం ధర 99వేలకు చేరువైంది.. మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.490 మేర ధర పెరిగింది..

దేశీయంగా ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 మేర పెరిగి.. రూ.98,130గా ఉంది.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.450 మేర ధర పెరిగి.. రూ.89,950 గా ఉంది..

హైదరాబాద్‌ 24 క్యారెట్ల బంగారం ధర రూ.98వేల 130 రూపాయిలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.89వేల 950 రూపాయిలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,11000లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,950లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,11,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,280గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,100లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,00,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,130, 22 క్యారెట్ల ధర రూ.89,950 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande