ముంబై, 31 మే (హి.స.)
ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పెరిగాయి.. గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరాయి.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. మే 31 2025 శనివారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర 97,320 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,210 లుగా ఉంది.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర ధర పెరిగింది.. వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.99,800 లుగా ఉంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,320గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,210లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,800లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,360లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,800లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,800లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి