ముంబై, 29 మే (హి.స.) పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చాయి.. అనంతరం మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. మే 29 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,470 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,340 లుగా ఉంది.. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.100 తగ్గింది.. రూ.99,900 లుగా ఉంది.
బంగారం, వెండి ధరలు..హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,340లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.1,10,900లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,340లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి