న్యూఢిల్లీ, 27 మే (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీ వలసదారుల ఏరువైతే లక్ష్యంగా సౌత్ వెస్ట్ జిల్లా లో గత 10 రోజులుగా వెరిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 88 మంది బంగ్లాదేశీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న బంగ్లాదేశీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం వాళ్లను తిరిగి వాళ్ల దేశానికి పంపించేందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ 88 మందితో కలిపి 2024 డిసెంబర్ 26 నుంచి ఇప్పటివరకు సౌత్ వెస్ట్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య 142కు చేరింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మీడియాకు వెలడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్