న్యూఢిల్లీ, 27 మే (హి.స.)
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 8 స్థానాలకు పోలింగ్ తేదీ ప్రకటించింది. జూన్ 19న పోలింగ్ జరగనుంది.
ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎగువ సభలో 128 ఎంపీలు ఉండగా.. ప్రతిపక్షానికి 89 మంది ఎంపీలు ఉన్నారు. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ, బీఎస్పీ, ఎంఎన్ఎఫ్ వంటి పార్టీలకు 20 మంది ఎంపీలుండగా.. ప్రస్తుతం ఎనిమిది సీట్లు ఖాళీ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..