ముంబయి , 27 మే (హి.స.): దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. దీంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 750 పాయింట్ల నష్టంతో 81,530 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో.. ఎటర్నల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, బజాజ్ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కేవలం ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు మాత్రమే లాభాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 64.57 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు ధర 3,345 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు