v
న్యూఢిల్లీ, 27 మే (హి.స.)పారిస్, దోహా, సియోల్, కువైట్‌ సిటీ: ఆటవిక ఉగ్రవాదంపై పోరాటంలో ఒకే గొంతుక వినిపిద్దామని ప్రపంచ దేశాలకు భారత్‌ పిలుపునిచ్చింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల పుట్టని, అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులున్నారని స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో అంట
v


న్యూఢిల్లీ, 27 మే (హి.స.)పారిస్, దోహా, సియోల్, కువైట్‌ సిటీ: ఆటవిక ఉగ్రవాదంపై పోరాటంలో ఒకే గొంతుక వినిపిద్దామని ప్రపంచ దేశాలకు భారత్‌ పిలుపునిచ్చింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల పుట్టని, అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులున్నారని స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ప్రపంచ వేదికలపై ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు పలు దేశాలకు వెళ్లాయి. ఆయా దేశాల్లోని నేతలకు, మీడియాకు, మేధావులకు మన ప్రతినిధుల బృందాలు ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరిస్తున్నాయి. సోమవారం ఫ్రాన్స్, కువైట్, దక్షిణ కొరియా, ఖతార్, స్లోవేనియా, గుయానాల్లో పర్యటించిన బృందాలు అక్కడి నేతలకు ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్‌ అందిస్తున్న సహకారం గురించి తెలిపాయి.

భారత్‌.. శాంతిని, మైత్రినే కోరుకుంటుందని, అయితే అమాయక పౌరుల ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోబోదని ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భాజపా నేత రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం తేల్చి చెప్పింది. దేశాల ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఒకే గొంతుక వినిపిద్దామని పిలుపునిచ్చింది. ఈ బృందం సెనెట్, జాతీయ అసెంబ్లీ, మేధావులతోపాటు ప్రవాస భారతీయులతో భేటీ కానుంది. ఐరోపా దేశాలు, బ్రిటన్‌లు ఉగ్రవాద బాధిత దేశాలేనన్న విషయాన్ని రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు.

కువైట్‌లో ఆ దేశ ఉప ప్రధాని, క్యాబినెట్‌ వ్యవహారాలశాఖ మంత్రి షెరీదా ఎఏస్‌ అల్‌ మౌషర్జీతో భాజపా ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలోని బృందం భేటీ అయింది. సీమాంతర ఉగ్రవాదంపై ఇటీవల భారత్‌ చేపట్టిన చర్యల గురించి వివరించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, కువైట్‌ ఐక్యంగా నిలుస్తున్న అంశం వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. అంతకుముందు బహ్రెయిన్‌ పర్యటన సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారని పేర్కొన్నారు. పాక్‌ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశమని, అయినా అక్కడి వారిలో ఐక్యత లోపించిందని విమర్శలు గుప్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande