రైతులకు ప్రధాని మోదీ వరాల జల్లు..
న్యూఢిల్లీ, 28 మే (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియ
ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 28 మే (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో

జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత పది పదకొండేళ్లలో ఖరీప్ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందన్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు ఎమ్మెస్పీ పెంపునకు ఆమోదం చెప్పింది.

2025-26 ఖరీఫ్ సీజన్కు వరికి క్వింటాలు రూ.69 మద్దతు పెంచింది. తాజాగా పెంపుతో రూ.2,369 పెరిగిందని మంత్రి తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కేటాయించినట్లు పేర్కొన్నారు. జొన్నలు క్వింటాల్కు రూ.328, సజ్జలు క్వింటాల్కు రూ.150, రాగులు క్వింటాల్ రూ.596, మొక్కజొన్న క్వింటాల్కు రూ.175 పెంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. కందిపప్పు క్వింటాల్కు రూ.450, పెసర్లు క్వింటాల్కి రూ.86, మినుములు క్వింటాల్ రూ.400, వేరుశెనగ క్వింటాల్ రూ.480 పెంచినట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande