14 పంటలకు MSP పెంపు.. బద్వేల్‌-నెల్లూరు 4లేన్‌ రోడ్డు అభివృద్ధికి కేంద్రం ఆమోదం
దిల్లీ 28 మే (హి.స.)కేంద్ర క్యాబినెట్‌(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు (MSP) ధర రూ.2369కి చేర
14 పంటలకు MSP పెంపు.. బద్వేల్‌-నెల్లూరు 4లేన్‌ రోడ్డు అభివృద్ధికి కేంద్రం ఆమోదం


దిల్లీ 28 మే (హి.స.)కేంద్ర క్యాబినెట్‌(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు (MSP) ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ కోసం ఎంఎస్‌పీ పెంపును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందన్నారు. ఆయా పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లుతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande