పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌!
దిల్లీ: 28 మే (హి.స.)పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో మే 29న మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌లోని ఆయా జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై స్థానికుల
పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌!


దిల్లీ: 28 మే (హి.స.)పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో మే 29న మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌లోని ఆయా జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌర సన్నద్ధతపై ఆపరేషన్‌ అభ్యాస్‌ (Operation Abhyas) పేరుతో మే 7న దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అదేరోజు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన భారత సైన్యం.. పాకిస్థాన్‌, పీవోకేలపై దాడులు చేసింది. అక్కడి ఉగ్రవాద, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande