న్యూఢిల్లీ, 28 మే (హి.స.)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే . మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో సిందూరం లోగోతో కూడిన ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్ను పెట్టారు. 25 నిమిషాల పాటు మెరుపులు దాడులు జరగ్గా, ఆ తర్వాత అర్ధరాత్రి 1.51 గంటలకు ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్ను పోస్టు చేసింది ఇండియన్ ఆర్మీ.
అయితే మన సైనికుల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్కు అంకితమిస్తూ ఇండియర్ ఆర్మీ పత్రికి బాత్ చిట్(మాటామంతీ) తాజా సంచిక వెలువడింది. లెఫ్టినెంట్ కర్నల్ హర్షుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించినట్లు ఆ పత్రిలో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..