ఉగ్రదాడిపై రష్యా రాయబాది
డిల్లీ, 28 మే (హి.స.)జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిపై రష్యా రాయబాది తమ అభిప్రాయం వెల్లడించారు. ఉగ్రదాడిపై భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 22న జరిగింది దారుణమైన నేరం. దీనిని విస్తృతంగా ఖండించారు
ఉగ్రదాడిపై రష్యా రాయబాది


డిల్లీ, 28 మే (హి.స.)జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిపై రష్యా రాయబాది తమ అభిప్రాయం వెల్లడించారు. ఉగ్రదాడిపై భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 22న జరిగింది దారుణమైన నేరం. దీనిని విస్తృతంగా ఖండించారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న వెంటనే అధ్యక్షుడు పుతిన్ సహా రష్యా అంతా భారత్‌కు మద్దతు తెలిపింది. ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక సందేశం కూడా పంపారు, సానుభూతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా దోషులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షించాలని మేం ఆశిస్తున్నామని కూడా పేర్కొన్నారు. భారత్‌ చివరికి అదే చేసింది. ఉగ్రవాదంపై ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని మేం గతంలోనే చెప్పాం.”

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande