ఉత్తరప్రదేశ్ : 29 మే (హి.స.)పోలీసు ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు, షార్ప్షూటర్ నవీన్కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై హత్యలు, దోపిడీలు సహా 20కి పైగా క్రిమినల్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ ముఠా కార్యకలాపాలు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని హాపుర్ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్ ), ఢిల్లీ పోలీసులు గురువారం సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు నవీన్కుమార్ అక్కడికి చేరుకున్నాడు. పోలీసులను గమనించిన వెంటనే వారిపై కాల్పులకు తెగబడ్డాడని, అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోవడానికి విఫలయత్నం చేశాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా నవీన్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..