హైదరాబాద్, 29 మే (హి.స.)
ఐపీఎల్ 2025లో కీలక దశ మొదలైంది. నేటి నుంచి నాకౌట్స్ ఆరంభం కానున్నాయి. నేడు క్వాలిఫయర్ 1 షెడ్యూల్ అయింది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముల్లాన్ పూర్.. ఈ బిగ్ గేమ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లే టాప్ 2లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లకూ 19 చొప్పున పాయింట్లు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ కంటే నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటం వల్ల పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది.11 సంవత్సరాల తరువాత పంజాబ్ కింగ్స్ మొదటిసారిగా ప్లేఆఫ్స్ ఆడబోతోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..