బెంగళూరు, 29 మే (హి.స.)
కర్నాటక సర్కారు కొత్త
ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరిగే మత ఘర్షణలను ఎదుర్కొనేందుకు కొత్త దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. మూడు కంపెనీలతో ఆ దళం ఉంటుందని పేర్కొన్నది. దక్షిణ కన్నడ, శివమొగ్గం, ఉడిపి జిల్లాల్లో ఆ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ .. మతఘర్షణ వివాదాలపై దృష్టి పెట్టనున్నది. దీనికి సంబంధించిన ఆదేశాలను మే 28వ తేదీన రిలీజ్ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం ఆ దళంలో 248 మంది ఆఫీసర్లు ఉంటారు. సీనియర్ డీఐజీపీ కూడా దీంట్లో ఉంటారు.
మతపరమైన ఘర్షణలు, ప్రేరేపిత ఘటనలు, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం ఆ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ తొలి ప్రాధాన్యత అవుతుంది. రాష్ట్రంలో శాంతి, సామర్యం ఏర్పడడానికి కమ్యూనిటీ నేతలతో చర్చలు నిర్వహించాలని ఆదేశించినట్లు హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..