న్యూఢిల్లీ, 29 మే (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల (ఆన్లైన్ వేదికల ద్వారా పనిచేసేవారు) హక్కులు, సంక్షేమంపై గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ కార్మికులు తనతో పంచుకున్న ఆవేదనను గుర్తుచేసుకున్నారు. “మాకు రేటింగ్ కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే కానీ, బానిసలం కాదు” అని వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తన మదిలో బలంగా నాటుకుపోయాయని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. గిగ్ కార్మికుల భద్రత, న్యాయమైన ఒప్పందాలపై కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చారిత్రాత్మకమైందని అభివర్ణించారు.ఆర్డినెన్స్తో భరోసా..కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల హక్కులు, గౌరవం, భద్రతకు హామీ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం చారిత్రాత్మక ముందడుగు అని రాహుల్ ప్రశంసించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..