న్యూఢిల్లీ, 29 మే (హి.స.)
భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి సహకరించే వారికి 'ఆపరేషన్ సిందూర్'తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని పేర్కొన్నారు.
సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు.
వాస్తవానికి ప్రధాని మోదీ నేడు సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా ఈ పర్యటన రద్దైంది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాహస క్రీడలకు హబ్గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..