మహారాష్ట్ర, 29 మే (హి.స.) మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్కు చెందిన రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటన లాతూర్ సోలాపూర్ హైవేపై గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తుల్జాపూర్- లాతూర్ మార్గంలోని ఆశివ్ ఫాటా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి. పూణె నుంచి లాతూరు వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదే మార్గంలో వెళ్తున్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది వరకూ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..