డిగ్రీలో కనీసం 75 శాతం .హాజరు. లేకపోతే. ఫీస్.రీయింబర్స్మెంట్ కట్
హైదరాబాద్‌, 30 మే (హి.స.), : డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత ఉండదని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ
డిగ్రీలో కనీసం 75 శాతం .హాజరు. లేకపోతే. ఫీస్.రీయింబర్స్మెంట్ కట్


హైదరాబాద్‌, 30 మే (హి.స.), : డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత ఉండదని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ వర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో..డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలున్నాయని, కానీ అది అమలు కావడం లేదని వీసీలు ప్రస్తావించారు. ఈసారి హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి తప్పనిసరిగా ఈ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో కొంత వరకు విద్యానాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande