న్యూఢిల్లీ: 30 మే (హి.స.)ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో పాకిస్థాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో శశిథరూర్ (Shashi Tharoor) నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియా (Colombia)కు వెళ్లింది. ఈక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా.. భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశ పరిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు