మణిపుర్‌లో. ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన పూర్తి
-ఇంఫాల్‌ -, 30 మే (హి.స.)ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపర్చడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపుర్‌లో ఇటు రవాణాకు, అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన - 164 (నోనీ బ్రిడ్జి) నిర్మాణం పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తు ఉండే ఈ వంతెన ప్ర
మణిపుర్‌లో. ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన పూర్తి


-ఇంఫాల్‌ -, 30 మే (హి.స.)ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపర్చడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపుర్‌లో ఇటు రవాణాకు, అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన - 164 (నోనీ బ్రిడ్జి) నిర్మాణం పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తు ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే పియర్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) సరికొత్త మైలురాయిని అధిగమించింది. వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా.. చివరి భాగాన్ని విజయవంతంగా ఏర్పాటుచేయడం ద్వారా నిర్మాణం పూర్తయినట్లు ఎన్‌ఎఫ్‌ఆర్‌ సీపీఆర్వో కపింజల్‌ కిశోర్‌శర్మ తెలిపారు. ఇంజినీరింగ్‌ అద్భతమైన ఈ వంతెన మణిపుర్‌ ప్రాంత రవాణా నెట్‌వర్క్‌కు కీలకమైనదిగా చెప్పారు. 111 కి.మీ.ల జిరిబామ్‌-ఇంఫాల్‌ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వంతెనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవి దీనికి ఏర్పాటుచేసిన పీ3, పీ4 అనే రెండు పెద్ద స్తంభాలు. ఇవి ఒక్కోటి 141 మీటర్ల ఎత్తు ఉంటాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande