భోపాల్, 31 మే (హి.స.)
సింధూరం సంప్రదాయకంగా వివాహ బంధానికి చిహ్నమైనప్పటికీ, ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. భారతదేశం గొప్ప సంస్కృతి కలిగిన దేశమని అంటూ మన సంప్రదాయంలో సింధూరం నారీ శక్తికి చిహ్నమన్నారు. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని మోదీ ప్రస్తావించారు.
మధ్యప్రదేశ్ భోపాల్లో శనివారం నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని ముందుగా దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను ప్రారంభించారు.అహల్యాబాయి అభివృద్ధి, పురోగతికి చిహ్నం..అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవి అహల్యాబాయి దేవుని ఆరాధనకు, ప్రజల సేవకు ఎలాంటి భేదం చూపలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆమె పేదల జీవితాల్లో పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..