దిల్లీ: , 31 మే (హి.స.)ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో పాకిస్థాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే తమ సంతాప ప్రకటనను కొలంబియా (Colombia) వెనక్కి తీసుకుంది.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఈక్రమంలో ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పూర్తి విషయాలను ఆయన తెలియజేశారు. అనంతరం యెలాండ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘ఈ రోజు భారత బృందం మాకు అన్ని విషయాలను తెలియజేసింది. కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నాం. దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం థరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు