దేశంలో 2 వేలు దాటిన కొవిడ్‌ కేసులు
దిల్లీ:, 31 మే (హి.స.) దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 2,710 యాక్టివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్ర
Nipah virus


దిల్లీ:, 31 మే (హి.స.) దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 2,710 యాక్టివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, దిల్లీ తరువాత స్థానంలో ఉన్నాయి. నాలుగు రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1,010 కేసులు నమోదవగా.. మే 30 నాటికి మొత్తం 2,710కు పెరిగినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని.. ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande